ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ మాత్రం ఇద్దరూ సమానమే: లగడపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2017, 11:28 AM

విజయవాడ: నంద్యాల ఉపఎన్నికలపై చేపట్టిన సర్వే నిజం కావడం పట్ల మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. నంద్యాల టౌన్‌లో టీడీపీకి భారీ మెజార్టీ వస్తుందని, రూరల్‌లో మాత్రం కాస్త తగ్గుతుందని సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు అదే నిజం కాబోతోందని లగడపాటి అన్నారు. అయితే గోస్పాడులో మాత్రం రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వస్తాయని తెలిపారు. టీడీపీ మెజారిటీ 30 వేలు దాటుతుందని లగడపాటి చెప్పారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని లడపాటి సర్వేలో తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు నంద్యాల ఉపఎన్నికల ఫలితాల్లో టీడీపీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa