వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తున్న కొంత మంది ఆ ఉచ్చులో నుండి బయటపడటం లేదు. తాజాగా ఓ మహిళ ఒకే సమయంలో ముగ్గురితో ఎఫైర్ పెట్టుకుంది. అందులో ఒకడిని మిగతా ఇద్దరు ప్రియులతో కలిసి స్కెచ్ వేసి చంపేసింది. ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు కు చెందిన నాగమల్లేశ్వరి అనే మహిళకు గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.
పెళ్లైన కొన్ని రోజులకే భర్త మరణించడంతో నాగమల్లేశ్వరి ఉపాధి నిమిత్తం సత్తెనపల్లి కి వచ్చి ఓ హోటల్ లో పనికి కుదిరింది. ఈ క్రమంలో మొదటి లాక్ డౌన్ సమయంలో అదే హోటల్ లో పని చేయడానికి వచ్చిన కడప జిల్లా మైదుకూరు చెందిన చెందిన చాంద్ బాషా తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య సహజీవనానికి దారి తీసింది. అయితే ఓ వైపు చాంద్ బాషా తో సంబంధం పెట్టుకున్న నాగమల్లేశ్వరి మరో ఇద్దరితోనూ ఎఫైర్ నడపసాగింది.
ఈ విషయం తెలుసుకున్న బాషా నిత్యం మద్యం సేవించి ఆమెను కొట్టడంతో పాటు ఆమెకున్న వివాహేతర సంబంధాలను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడిని అంతం చేయాలని భావించి మిగతా ఇద్దరు ప్రియుల సహకారం కోరింది. ప్రియురాలు అడగడంతో రెంటచింతల గ్రామానికి చెందిన అమరయ్య, దూళిపాళ్లకు చెందిన సుబ్బారావు ఒప్పుకున్నారు. నాగమల్లేశ్వరి కలిసి బాషా మర్డర్ కు స్కెచ్ వేశారు.
డిసెంబర్ 3న రైల్వేస్టేషన్ రోడ్డులోని స్టేడియం గ్రౌండ్ వద్దకు తీసుకువచ్చి ఫుల్ గా మద్యం తాగించారు. అనతరం గొంతు నులిమి, ఛాతీపై బలంగా గుద్ది హత్య చేశారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నాగమల్లేశ్వరి ని అరెస్ట్ చేసి విచారించగా అసలు నేరం అంగీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa