ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ ను హతమార్చే కుట్ర: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 10:38 AM

అనంతపురం: చంద్రబాబు అధికారం లేకపోతే ఒక్కక్షణం ఉండలేరు. అవసరమైతే సిఎం జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నాడని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి బంగాళా లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ, వాడు ఎవడో మల్లాది వాసు కోన్ కిస్కా గొట్టంగాడు వంశీ, నాని, అంబటి రాంబాబు ని హత్య చేస్తే రూ. 50 లక్షలు ఇస్తాం అంటాడు. వంశీ, నానిది తప్పు అయితే వాసు ది తప్పు కాదా. టీడీపీ నేతలు ఎవరు ఎందుకు దీనిని ఖండించడంలేదు.


చంద్రబాబు, బాలక్రిష్ణ , కేశవ్ ఎందుకు దీనిని ఖండించరు. గతం లోను మీరు చేసిన అరాచకాలకు పరిటాల రవీంద్ర ను ముందు పెట్టి టీడీపీ పండుగ చేసుకుంది. అనంతపురంలో మల్లాది వాసు అభిమానుల పేరుతో ఫ్లెకీలు వేయడం ఏంటి. ఇదేనా తెలుగుదేశం విధానం అని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ను గద్దె దించి ఆయన పై చెప్పులు వేయించి సీటు లాక్కోని కూర్చుంటే అప్పుడు అది గౌరవ సభ అంటారా. ఓ మహిళా ఎమ్మెల్యే ను నీచంగా సస్పెండ్ చేసింది కౌరవసభ కాదా. గతం లో 23 మంది ఎమ్మెల్యే లను లాక్కోవడం గౌరవ సభ అవుతుందా.? గతంలో 13 వేల కోట్ల డ్వాక్రా ఋణలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన మాట తప్పారు.


మహిళలకు నేరుగా అకౌంట్ల లో డబ్బులు వేస్తూ వారి గౌరవం నిలుపుతున్న వ్యక్తి సీఎం జగన్. వల్లభనేని వంశీ వంటి వారిని ఇప్పటికి పార్టీలో కి తీసుకోలేదు. మీ విధానాలు నచ్చక బయటికి వచ్చారు. వంశీ ప్రెస్ మీట్ లో నెల కిందట చంద్రబాబు భార్య ను దూషిస్తే, అప్పుడు చంద్రబాబు కి ఏడుపు రాలేదు, మైలేజీ రాదని ఆరోజు ఎవరు స్పందించలేదు. సైకిల్ గుర్తు పై గెలిచిన వారు ఎవరిని పార్టీ లోకి తీసుకోలేదు. సభలో రైతుల సమస్యలపై మాట్లాడుతుంటే ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకొని నెల రోజుల కిందట వంశీ మాట్లాడిన మాటలను సభలో అన్నట్లు సృష్టించి డ్రామా రక్తికట్టించారు.


ఇప్పటికైన తమపద్దతులు మార్చుకోవాలని హితువు పలికారు. టీడీపీ వాళ్ళు రాష్ట్రంలో కౌరవులు, వరదల సమయంలో ప్రజల గోడు వినకుండా మీ గోడు చెప్పుకున్నారు. రామారావు కూతురు గౌరవాన్ని బజారుకి ఈడ్చారు. చంద్రబాబు వరద బాదితులను పరామర్శించడానికి వెళ్లి తన భార్యను అవమానించారంటూ గోడును వినిపించాడు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని హితువు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa