ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌: స్పీకర్‌ తమ్మినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 11:02 AM

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోందా?. స్పీకర్ తమ్మినేని తాజాగా చేసిన వ్యాఖ్యలతో అవుననే సమాధానం వస్తోంది. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా లక్ష ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. కాగా త్వరలోనే పెద్ద సంఖ్యలో బ్యాక్ లాగ్ టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు నిరుద్యోగులలో ఆశలు చిగురింప చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa