ఇటలీలోని సిసిలియన్ పట్టణంలోని రావణుసాలో మీథేన్ గ్యాస్ పేలుడులో నివాస భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు మరో ఆరుగురు గల్లంతుయినట్లు నేషనల్ ఫైర్ కార్ప్స్ ఆదివారం ట్వీట్ చేసింది. శిథిలాల నుండి ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులను సజీవంగా కాపాడారు. ఇక అగ్నిమాపక దళం, చుట్టుపక్కల భవనాల నుండి 50 కుటుంబాలను ఖాళీ చేయించారు.
శనివారం రాత్రి సంభవించిన పేలుడులో మూడు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అగ్రిజెంటో ఫైర్ బ్రిగేడ్ కమాండర్ గియుసెప్ మెరెండినో మాట్లాడుతూ.. గ్యాస్ భూగర్భంలో నిలువ ఉంచబడింది అని అది "కొండచరియలు విరిగిపడటం లేదా ప్రతికూల వాతావరణం కారణంగా లీక్ సంభవించి ఉండవచ్చు" అని ఆయన చెప్పారు. అందుకే పేలుడు సంభవించిందని అయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa