ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లఖింపుర్‌ ఖేరీ ఘటనపై సిట్ షాకింగ్ విషయాలు వెల్లడి

national |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 11:42 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ సంచలన విషయాలు వెల్లడించిది. అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా ఆ తర్వాత చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటనపై ఏర్పాటైన సిట్ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఘటన ప్రణాళిక ప్రకారం ముందస్తుగా చేసిన కుట్ర అని స్పష్టం చేసింది. దీంతో నిందితులపై హత్యాయత్న అభియోగాల నమోదుకు కోర్టు సమ్మతి ఇచ్చింది. ఈ ఘటన ముందస్తు కుట్ర అని సిట్‌ వెల్లడించడంతో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. అజయ్‌ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa