మయన్మార్ సైనిక ప్రభుత్వానికి చెందిన బలగాలు శరణార్థుల శిబిరాలకు వెళుతున్న 30 మందిని కాల్చిచంపాయి. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు సహా 30 మంది ఉన్నారు. వారి మృతదేహాలకు సైన్యం నిప్పుపెట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కయాహ్ రాష్ట్రంలోని మోసో గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మోసో గ్రామం పక్కనే ఉన్న కియో గాన్ గ్రామం సమీపంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు, మయన్మార్ సైన్యానికి మధ్య పోరాటం జరిగింది. ఆ సమయంలో శరణార్థులు శిబిరాలకు పారిపోయారని ఓ గ్రామస్థుడు చెప్పారు. ఈ క్రమంలో వారిని ప్రభుత్వ బలగాలు అరెస్టు చేసి కాల్చి చంపాయని, అనంతరం మృతదేహాలకు నిప్పుపెట్టాయని తెలిపారు. ఆ ప్రాంతంలో మహిళలు, చిన్న పిల్లల దుస్తులు, ఆహారం, ఔషధాలు కనిపించాయని చెప్పారు. మృతదేహాలను తాళ్లతో కట్టేసి అనంతరం వాహనాల్లో పడేసి నిప్పుపెట్టారని తెలిపారు. తుపాకులతో కాల్చి చంపడాన్ని తాను ప్రత్యక్షంగా చూడలేదని, అయితే చనిపోయిన వారు శుక్రవారం మోసో గ్రామంలో అరెస్టైన వారేనని భావిస్తున్నట్లు ఆ సాక్షి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa