వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 31 నెలల్లో అప్పులు.. దౌర్జన్యాలే చేసిందని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి విమర్శించారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ ఏం చేసింది..? ఇంకా ఏం చేయబోతోందనేది ప్రజాగ్రహ సభలో చెబుతాం. బీజేపీకి వైసీపీతో టై ఉందనే ప్రచారం చేస్తున్నారు.. జగనుతో టై లేదు.అంతా సై. వైసీపీపై పోరాటానికి సై అని చెప్పడానికే ప్రజాగ్రహ సభ. జగనుపై చాలా కేసులు ఉన్నాయి.. అవన్నీ బయటకొస్తాయి. జగన్ జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. సీజేఐ ఎన్వీ రమణపై గతంలో జగన్ ప్రభుత్వం ఎన్నో విమర్శలు చేసింది.. ఫిర్యాదులు చేసింది. ఇప్పటి వరకు సీఎం జగన్ ఫొటో తప్ప ఫ్లెక్సీల్లో వేరే వాళ్ల ఫొటోనే ఉండేది కాదు.. అలాంటిది సీజేఐ పర్యటనలో సీజేఐది పెద్ద ఫొటో.. జగనుది చిన్న ఫొటో వేశారు. ఇదంతా చూస్తుంటే హస్యాస్పదంగా ఉంది. గతంలోనే సీజేఐ శ్రీశైలం, తిరుపతికి వచ్చినప్పుడు.. కనీసం ప్రొటోకాల్ ఇవ్వలేదు.అప్పుడు గుర్తుకురాని ప్రొటోకాల్ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది..?ఏదో ఆశించి జగన్ సీజేఐకు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేశారు. సీఎం జగన్ అనుకున్నట్టు ఏం జరగదు. సీజేఐ ఎన్వీ రమణ ఎంతో పెద్ద మనిషి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి.. జగన్ పప్పులు ఉడకవు. గర్బం దాలిస్తే బిడ్డ వస్తుంది.. అలాగే కేసులు సమయం దగ్గర పడితే జరగాల్సింది జరుగుతుంది.త్వరలో బీజేపీ సారధ్యంలో రామరాజ్యం వస్తుంది. అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa