సీఎం జగన్ ఆదేశాల మేరకు పీఆర్సీపై మళ్లీ కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టవచ్చని తెలిపారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని, మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని సజ్జల తెలిపారు. ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం అని, ఫిట్మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని చెప్పారు. బడ్జెట్పై పడే పీఆర్సీ భారం అంచనా వేస్తున్నామని, అందుకే ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలిపారు. తప్పకుండా వేతనం పెరుగుదల ఉంటుందని, ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం చర్చలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa