ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 09:25 AM

విశాఖపట్నం: నూతన సంవత్సర వేడుకలపై నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆంక్షలు విధించారు. ఈమేరకు పొలీస్ కాన్ఫరెన్స్ హల్ లో బుదవారం పొలీస్ ఉన్నతాధికారులతో నూతన సంవత్సర వేడుకలకు సంబందించి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తి దృష్యా డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ , బి. ఆర్. టి. ఎస్ రహదారి తో పాటుగా ఇతర రహదారులను మూసివేస్తున్నట్లు వెళ్లడించారు.


ప్రజలు వేడుకల పేరిట ఆర్భాటాలు చెయ్యడం నిషేధించినట్లు స్పష్టం చేసారు. 31 డిసెంబర్ అర్ధరాత్రి ద్విచక్ర వాహనలపై తిరుగుతూ హడావుడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే రెస్టారెంట్ లు, వైన్ షాపు లు సమయపాలన ప్రకారం తెరచి ఉంటాయని ఎక్కడ డి. జే సౌండ్ లు పెట్టిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చేస్తే మీ ఇంట్లో న్యూ ఇయర్ చేసుకోండి. లేదా పోలీస్ స్టేషన్ లో మాతో కలిసి న్యూ ఇయర్ చేసుకోండి అంటు చమత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa