ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మలతో మాట్లాడేందుకు వెళ్లిన యువతి మిస్సింగ్!

national |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 03:38 PM

ఆత్మలతో మాట్లాడేందుకు వాటిని అన్వేషిస్తూ ఇల్లు విడిచి వెళ్లిన ఓ 17 ఏళ్ల యువతి అదృశ్యం అయ్యింది. అక్టోబర్ 31న తమ కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని యువతి తండ్రి చెబుతున్నారు. ఆమె ఆచూకీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి.


వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అనుష్క 'షమానిజం' తో ప్రభావితమై ఇంటినుంచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అనుష్క గత 2 నెలలుగా తన ఇంట్లో కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం వెనుక ‘షమానిజం’ ప్రభావితమై ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అచూకీ గుర్తించేందుకు తల్లిదండ్రులు ఇప్పుడు సోషల్ మీడియా సహాయం తీసుకున్నారు. ‘షమానిజం’ అనేది ఒక పురాతన సంప్రదాయం. దీని ద్వారా ప్రజలు దేవుళ్లు, రాక్షసులు, పూర్వీకుల ఆత్మలు కనిపిస్తాయని విశ్వసిస్తారు. కూతురి ఆచూకీ కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని యువతి తండ్రి అభిషేక్ తెలిపారు. కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa