ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ పై కలిసి పోరాడాలి

international |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 12:30 AM

ప్రపంచ దేశాలను ఐక్యమత్యంగా పనిచేస్తేనే కోవిల్ మహమ్మారిని ఎదుర్కోగల మని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. దేశాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగాయ్. అమెరికా, యూకేల్లో ఈ కేసులు లక్షలాది సంఖ్యలో ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ కీలక సూచనలు చేశారు. దేశాల మధ్య అసమానతలు తొలగించి కలసి పనిచేస్తేనే 2022లో కోవిడ్ వైరస్ అంతమవుతుందని అన్నారు. కోవిడ్ నుంచి ఏ దేశం బయటపడలేదని, కొత్త చికిత్స విధానాలతో కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దేశాల మధ్య అసమానతలు కొనసాగితే మాత్రం వైరస్ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. దానికోసం అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడాలని అన్నారు. ఈ ఏడాది మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు పనిచేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. దీనికోసం దేశాలన్నీ ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa