ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా టీకా అని చెప్పి పిల్లలు పుట్టకుండా చేశారు!

national |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 09:54 AM

అమాయక కూలీని ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. కోవిడ్ టీకా ఇప్పిస్తానని వెంట తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ జిల్లాలో జరిగింది. ప్రతాప్ నగర్ కు చెందిన కైలాశ్ పుత్ర బాబులాల్ డిసెంబర్ 29న ఎప్పటిలా ఉదయం కూలీ పని కోసం నిల్చున్నాడు. ఇంతలో అక్కడికి నరేశ్ అనే వ్యక్తి వచ్చి రూ.2000 ఇస్తే కరోనా టీకా ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. పులాలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడా కైలాశ్ కు ఓ ఇంజెక్షన్ ఇవ్వగా అతను వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి వచ్చిన కైలాశ్ తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని తెలుసుకుని భుపాల్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కైలాశ్ కు పెళ్లైనా ఇంకా సంతానం కలగలేదు. తన కుమారుడి పట్ల ఇలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కైలాశ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa