మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అ ఆ రెండు మంది ప్రయాణికులు సజీవ దహనానికి గురికావాల్సి వచ్చిందని ఆగ్రహించిన కోర్టు ఆ డ్రైవర్ కు సుదీర్ఘకాల శిక్షను విధించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించిన కోర్టు డ్రైవర్ మొహమ్మద్ షంషుద్దీన్కు సెక్షన్ 304 (పార్ట్ II) ప్రకారం 190 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బస్సు యజమాని జ్ఞానేంద్ర పాండేకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించింది. వివరాల్లోకి 2015న మే నెల 4వ తేదీన MP0533 అనే బస్సు 65 మంది ప్రయాణికులతో ఛతర్పూర్ నుంచి పన్నాకు వెళ్లై టైంలో మాడ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వర్టులో బస్సు బోల్తా పడిపోయింది. ఆ టైంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదం నుంచి చాలామంది గాయాలతో బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ 22 మంది సజీవదహనం అయ్యారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాక్ అయిపోవడం వల్ల బయటకు రాలేకపోయారు. ఈ దుర్ఘటనతో బస్సు ఓనర్, డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరేళ్లగా ఈ కేసుపై కోర్టులో వాదనలు సాగుతున్నాయి.ఈ కేసులో శుక్రవారం తీర్పు వచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించిన కోర్టు డ్రైవర్ మొహమ్మద్ షంషుద్దీన్కు సెక్షన్ 304 (పార్ట్ II) ప్రకారం 190 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బస్సు యజమాని జ్ఞానేంద్ర పాండేకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించింది. పోలీసుల దర్యాప్తు పూర్తైన తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి ఆర్పీ సోంకర్ ఆధ్వర్యంలో ఈ కేసుపై విచారణ సాగింది. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసును వాదించారు. నిందితుడి నేరం తీవ్రమైన కేటగిరీకి చెందినదిగా పరిగణించి, గరిష్టంగా శిక్షించాలని అభ్యర్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa