ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 01:43 PM

గుంటూరు: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలెం సచివాలయం -1ఆవరణలో నూతనంగా మంజూరైన రూ. 2500/- ల పింఛన్లను లబ్ధిదారులకు గ్రామ వైసీపీ నేతలు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి నూతన పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామ వైసీపీ నేతలు మాట్లాడుతూ. యర్రబాలెం గ్రామంలో మొత్తం 53 మంది నూతన లబ్ధిదారులకు సీఎం వై. ఎస్. జగన్ ప్రభుత్వం రూ. 2500/- ల పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి రూ. 2500 /- నూతన పింఛన్లను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు వారు గ్రామ ప్రజలందరి తరపునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం. కోటిరెడ్డి, గ్రామ వైసీపీ నేతలు గుండాల శ్రీనివాసరావు, దానబోయిన నాగయ్య, షేక్ షఫీ, షేక్ షర్మిల, పలగాని కోటేశ్వరరావు, మేరిగ నాగేశ్వరరావు, అంబటి వెంకటేష్, సర్వేపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa