ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లా గోపవరానికి సెజ్ తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 01:43 PM

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారం పేట వద్ద నిర్మాణంలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను..... కడప జిల్లా గోపవరానికి తరలించడంతో  అఖిలపక్షాలు మండిపడుతున్నాయి.   28 కోట్లతో గతేడాది మంత్రి గౌతమ్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా  శంకుస్థాపన చేసిన సెజ్ ను గుట్టుచప్పుడుకాకుండా …. గోపవరానికి తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ తో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశ పడిన ఆత్మకూరు యువతకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించి సెజ్ ను తిరిగి ఆత్మకూరులో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa