ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిపోతున్న పులుల సంఖ్య.. రెచ్చిపోతున్న వేటగాళ్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 06:47 PM

ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. భారత సంరక్షణ చర్యలతో దశాబ్దకాలంగా పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే 2021లో మాత్రం పులుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వేటగాళ్లు, ప్రమాదాలు ,మానవులు-పులుల మధ్య ఏర్పడుతోన్న సంఘర్షణ వల్ల 120 కంటే ఎక్కువ పెద్ద పులులు చనిపోయాయని తాజా గణాంకాలు చాటుతున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. . డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా.. పులి కళేబరం కనిపించింది. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు, పోలీసులతో పాటు కుమురం భీం జిల్లా అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టడంతో.. ముఠా గుట్టు రట్టైంది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa