ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీకెండ్ నో జర్నీ

national |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 11:40 PM

కరోనా, ఒమిక్రాన్ దూకుడు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. పెరుగుతున్న కారణంగా బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వీకెండ్స్‌లో బస్సు సర్వీసులను రద్దు చేసింది. ఈ శనివారం, ఆదివారాలు అంటే జనవరి 8, 9 తేదీల్లో, వచ్చే శనివారం, ఆదివారం అంటే జనవరి 15, 16 తేదీల్లో బస్సు తిరగవు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అక్కడ వీకెండ్ కర్ఫ్యూను విధించింది. స్కూళ్లు, కాలేజీలను క్లోజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బీఎంటీసీ ఈ నిర్ణయం తీసుకుంది. వీకెండ్స్‌లో సాధారణ ప్రజల కోసం బస్సులు తిరగవు. అయితే అవసరమైన సేవల్లో పాల్గొనే సిబ్బంది కోసం కేవలం పది శాతం బస్సులు మాత్రమే తిరగనున్నాయి. అంటే వారంతాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య బెంగళూరు నగరంలో పది బస్సులు తిరుగుతాయి. ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, రోగులు, బ్యాంకు, బీమా ఉద్యోగులు, మీడియా వ్యక్తులు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ బస్సులు ఎక్కొచ్చు. అయితే ఈ బస్సులో ఎక్కేందుకు వారందరూ తమ గుర్తింపును రుజువు చేయడానికి అవసరమైన పత్రాలను తమ వెంట తీసుకెళ్లాలి. కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి నిబంధనలను పెంచుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా గురువారం నుంచి రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆదివారాల్లో పూర్తిగా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. పంజాబ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు గుమిగూడకుండా ఉండేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa