ఆధునికతను అద్దిపుచ్చుకొంటున్న రైల్వేశాఖ తమ ప్రయాణికుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా రైళ్లలో ప్రయాణించే ప్యాసెంజర్లకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రయాణికులు మొబైల్ రీఛార్జ్ల నుంచి బిల్లు పేమెంట్ల వరకు, ఆధార్ పాన్ కార్డుల వరకు అన్నింటిన్ని రైల్వే స్టేషన్లలోనే పొందవచ్చు. కామన్ సర్వీసు సెంటర్(సీఎస్సీ)ల సాయంతో మొబైల్ రీఛార్జ్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్లు, ఆధార్ పాన్ కార్డు సేవలను త్వరలోనే 200 రైల్వే స్టేషన్లలో అందించనుంది రైల్టెల్. ఈ కామన్ సర్వీసు సెంటర్లను రైల్టెల్ ఏర్పాటు చేస్తోంది. పన్ను చెల్లింపులను కూడా రైల్వే స్టేషన్లోనే చేసుకునేలా ఈ సర్వీసు సెంటర్లు సేవలందించనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సీఎస్సీ-ఎస్పీవీ భాగస్వామ్యంలో రైల్టెల్ ఈ స్కీమ్ను లాంచ్ చేసినట్టు ప్రకటించింది. విలేజ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్లు ఈ కియోస్క్లను నిర్వహించనున్నారు. రైల్వైర్ సాథీ కియోస్క్ పేరుతో వీటిని ఆపరేట్ చేయనున్నారు. రైల్టెల్ రిటైల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు బ్రాండ్ పేరు రైల్వైర్. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ప్రయాగ్రాజ్ సిటీ స్టేషన్లలో ట్రయల్ బేసిస్లో ఈ రైల్వైర్ సాథీ సీఎస్సి కియోస్క్లను నడిపారు. ట్రయల్ బేసిస్లో ఇవి విజయవంతం కావడంతో, ఈ కియోస్క్లను దశలవారీగా సుమారు 200 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 44 కియోస్క్లు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో, 20 నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో, 13 ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో, 15 వెస్ట్రన్ రైల్వేలో, 25 నార్తరన్ రైల్వేలో, 12 వెస్ట్ సెంట్రల్ రైల్వేలో, 13 ఈస్ట్ కోస్ట్ రైల్వేలో, 56 నార్త్ ఈస్ట్ రైల్వే జోన్లో ఏర్పాటు చేస్తుంది. గ్రామీణ ప్రజలకు సాయం చేసేందుకు గ్రామీణ రైల్వే స్టేషన్లలో ఈ ముఖ్యమైన డిజిటల్ సర్వీసులను రైల్వైర్ సాథీ కియోస్క్లు అందించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa