ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ జిల్లాలో 174 కరోనా కేసులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 10:38 AM

విశాఖ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 174 కరోనా కేసులు నమోదయినట్టు రాష్ట్ర వైద్య అధికారులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శుక్రవారం 183 కేసులు నమోదు అవగా శనివారం మరో 9 కేసులు తక్కువగా నమోదయ్యాయి. శనివారం వచ్చిన కేసులతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 1142 మంది కరోనా బారినపడి మృతి చెందారు. అలాగే, జిల్లాలో ఇప్పటి వరకు 1,59,622 మందికి కరోనా సోకగా.. 1,57,709 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.


జిల్లాలో కరోనా మొదటి, రెండో దశలలో భారీగా కేసులు నమోదు అవ్వడంతో పాటు చాలా మంది మృతి చెందారు. మళ్ళీ కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ ను, నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కావున ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇంట్లో నుంచి అవసరం అయితేనే బయటికి రావాలని, వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa