కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీముల్లో 'అటల్ పెన్షన్ యోజన పథకం' కూడా ఒకటి. 2015లో ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకంలో చేరితే కనీసం రూ.1000 పెన్షన్ పొందవచ్చు. అలాగే గరిష్టంగా రూ.5 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. మీరు ప్రతి నెలా చెల్లించే మొత్తం ప్రాతిపదికన మీకు ఎంత పెన్షన్ వస్తుందనే అంశం నిర్ణయమౌతుంది.
ఈ స్కీమ్లో 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు చేరొచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. చేరిన తర్వాత ప్రతి నెలా కొంత డబ్బులు కడుతూ వెళ్లాలి. 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. జీవితాంతం పెన్షన్ వస్తుంది. సబ్స్క్రైబర్ మరణిస్తే భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి ఫండ్ డబ్బులు చెల్లిస్తారు. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో మీరు ఈ స్కీమ్లో చేరారని అనుకుందాం. రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000కు అయితే రూ.42, రూ.2 వేలకు రూ.84, రూ.3 వేలకు రూ.126, రూ.4 వేలకు రూ.168 చెల్లించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa