ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ నాలుగో టెస్టు' డ్రా'

national |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 04:39 PM

 యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో యాషెస్ టెస్టు డ్రాగా ముగిసింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు పోరాడడంతో మ్యాచ్ డ్రా అయింది.
ఆఖరి రోజు ఇంగ్లాండ్కు విజయానికి 258 పరుగులు అవసరం అవగా.. ఆస్ట్రేలియాకు 10 వికెట్లు దక్కాల్సి ఉంది. దీంతో రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. క్రాలే (77), స్టోక్స్ (60) అర్ధసెంచరీలతో రాణించారు. బెయిర్ స్టో (41) ఆకట్టుకున్నాడు. వీరితో పాటు చివర్లో జాక్ లీచ్ (26) పోరాడాడు. కమిన్స్ ఒకే ఓవర్లో బట్లర్ (11), వుడ్ (0)లను ఔట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే స్టువర్ట్ బ్రాడ్ (8), అండర్సన్ (0) చివరి వికెట్ను పడకుండా అడ్డుకున్నారు. దాంతో ఐదో ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లాండ్ను 294 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa