భారత్ కు కోవిడ్ ముంపు ఇంకా పోలేదని, మరింత అప్రమత్తత అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో, నగరాల్లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గినప్పటికీ.. కోవిడ్ ముప్పు నుంచి భారత్ పూర్తిగా బయటపడలేదని హెచ్చరించింది. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం చేయకూడదని, వైరస్ వ్యాప్తి కట్టడికి అవసరమైన చర్యలు కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా డైరక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సూచించారు. దేశంలో ఇంకా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోలేదని , అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. కోవిడ్ ఎండమిక్ దశలో ఉందా అనే ప్రశ్నకు ఇంకా మహమ్మారి మధ్యలోనే ఉన్నామని పూనమ్ ఖేత్రపాల్ చెప్పారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, ప్రాణాలను కాపాడడంపై దృష్టి సారించాలన్నారు. అయితే ఎండమిక్ దశకు చేరుకున్నంత మాత్రానా వైరస్ ప్రభావం తగ్గుతుందనుకోవడానికి లేదన్నారు. కరోనా కట్టడికి టీకా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బూస్టర్ డోసుతో రక్షణ పెరుగుతుందన్నారు. కోవిడ్ ఆంక్షలు పాటించడంతో పాటు, ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకునేలా చేయాలన్నారు. ఇది ప్రతి దేశానికి వర్తిస్తుందని చెప్పారు. ఇదిలావుంటే జనవరి 21న దేశంలో 347,254 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రోజు నుంచి కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, హర్యాణా, పశ్చిమ బెంగాల్లలో కోవిడ్ కేసులు తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు తగ్గుతోంది. దాంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని, పాఠశాలలను ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa