న్యాయార్క్ టైమ్స్ లో వచ్చిన ఓ కథనంతో మళ్లీ భారతదేశంలో పెగాసస్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇదిలావుంటే దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ అంశంపై అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన నివేదిక వెలువరించింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య 2017లో కుదిరిన సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంలో పెగాసస్ స్పైవేర్ భాగమేనని నివేదిక పేర్కొంది. ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. తాజాగా ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్వెపన్ కోసం యుద్ధం’’ పేరుతో నివేదికను ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్.. ప్రపంచవ్యాప్తంగా పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి ఎన్ఎస్ఓ తన సాఫ్ట్వేర్ను అమ్ముతోందని తెలిపింది. తమ సాఫ్ట్వేర్కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని వాగ్దానం చేసిందని పేర్కొంది. జులై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయేల్ పర్యటన గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. ‘ఇజ్రాయేల్లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ కాగా.. ఈ పర్యటన స్నేహపూర్వకంగా సాగింది.. ఈ సందర్భంగా పెగాసస్, క్షిపణి వ్యవస్థ ప్రధానాంశంగా సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన అధునాతన ఆయుధాలు, గూఢచార పరికరాల ప్యాకేజీని విక్రయించడానికి అంగీకరించింది’అని తెలిపింది. అనంతరం బెంజిమిన్ నెతన్యాహు భారత్లో పర్యటించారు.. జూన్ 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయేల్కు మద్దతుగా పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలకుల హోదాను నిరాకరించడానికి భారత్ ఓటు వేసింది’ అని నివేదిక తెలిపింది. కాగా, న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కేంద్రాన్ని పీటీఐ సంప్రదించగా.. తక్షణమే స్పందించడానికి నిరాకరించింది. అయితే, నిర్దిష్ట వ్యక్తులపై నిఘా ఉందనే ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇందులో నిజం లేదని పేర్కొంది. గత ఏడాది అక్టోబరులో పెగాసస్ ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతతో పేరుతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అమెరికా భద్రత విభాగం ఎఫ్బీఐ కూడా పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసింది. ‘‘గత వేసవిలో NSO పరికరాలను వినియోగించకూడదని నిర్ణయించుకుంది.. ఈ సమయంలోనే వార్తా సంస్థల కన్సార్టియం ఫర్బిడెన్ స్టోరీస్.. NSO సైబర్ ఆయుధాలను జర్నలిస్టులు, రాజకీయ అసమ్మతివాదులపై నిఘా కోసం వినియోగించింది’’ అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa