ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్లో మంటలు..ప్రయాణికులు దూకేశారు...అయినా అంతా సేఫ్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:19 AM

రైలులో అగ్నిప్రమాదం జరగ్గా అధికార్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళ్లితే గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు. మహారాష్ట్ర నందుర్భార్ రైల్వే స్టేషన్‌కి ట్రైన్ రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు ప్యాంట్రీ కారులో మంటలు అంటుకుని దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే ట్రైన్‌లో మంటలను గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై… కొంతమంది రైలు నుంచి దూకేశారు. దాంతో అధికారులు ట్రైన్‌ వెంటనే ఆపేశారు. సంబంధిత అధికారుల సమాచారంతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే మంటలు అంటుకున్న బోగీ నుంచి మిగిలిన బోగీలను వేరు చేశారు. వైద్య బృందం, ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా తరలించామని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా ప్యాంట్రీ కారు 13వ కోచ్‌గా ఉంది. కాగా మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా ముంబైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa