ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. భారీగా పతనమైన సెన్సెక్స్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 04:58 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిసాయి.  ఈ ఉదయం నష్టాలతోనే  ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పతనం కావడం, క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,023 పాయింట్లు నష్టపోయి 57,621 వద్ద ముగిసింది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,213 వద్ద నిలిచింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.88%), NTPC (0.67%), టాటా స్టీల్ (0.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.57%) మరియు అల్ట్రాటెక్ సిమెంట్ (0.32%).
టాప్ లూజర్స్:
HDFC బ్యాంక్ (-3.65%), L&T (-3.20%), బజాజ్ ఫైనాన్స్ (-3.15%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-2.94%), HDFC లిమిటెడ్ (-2.93%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa