ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాపై వేటుకు మరింత సమయం ఇస్తున్నా: రఘురామమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 04:59 PM

తనపై అనర్హత వేటు వేయించే విషయంలో వైసీపీకి మరింత సమయం ఇస్తున్నానని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆయనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీకి ఆయన రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రఘురామ స్పందించారు. ఫిబ్రవరి 5న తాను రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే, తనపై అనర్హత వేటుకు ఈ నెల 11 వరకు వైసీపీ నేతలకు సమయం ఇచ్చానని వెల్లడించారు. ఒకవేళ... ఇక నా వల్ల కాదు, నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ చెబితే అప్పుడు రాజీనామా చేస్తానని రఘురామ వివరించారు. రాజీనామా విషయంలో తాను స్పష్టతతోనే ఉన్నానని ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa