ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 01:12 PM

రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి‌ గ్రామానికి చెందిన‌ మధుసూదన్ రెడ్డి ఇంట్లో గత సంవత్సరం ఆగష్టు నెలలో దొంగతనం చేయడానికి‌ ప్రయత్నించిన ముగ్గురు దొంగలని అరెస్ట్ చేసినట్లు రామకుప్పం ఎస్సై వెంకటశివకుమార్ తెలిపారు. శాంతిపురం మండలం శివరామపురానికి చెందిన రాజశేఖరును 3వ తేదీన అరెస్టు చేసి రిమాండుకు పంపామని ఎస్సై పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురులను సోమవారం అరెస్టు చేసి తిరుపతి జువనైప్ కోర్టులో హాజరు చేశామని, దొంగతనం యత్నానికి పాల్పడినప్పుడు ఉపయోగించిన ఒక‌ ద్విచక్రవాహనం, గడ్డపార, కత్తిని సీజ్ చేశామని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa