గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక 2024 ఎన్నికలలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జండాను ఎగరవేసెందుకు అందరూ కృషి చేయాలని తెదేపా నాయకులకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఎస్. ఆర్. పురం మండలం స్థానిక టిడిపి కార్యాలయంలో గంగాధర నెల్లూరు ఎస్ ఆర్ పురం మండలాలకు సంబంధించిన 40 మంది చొప్పున 80 మంది తూ టిడిపి టాస్క్ఫోర్స్ టీమ్లు నియోజకవర్గ కోఆర్డినేటర్ చిట్టి బాబు నాయుడు అట్టహాసంగా ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటుకు యువత ముందుకు రావడం పార్టీకి శుభ పరిణామమని, స్వచ్ఛందంగా సేవలను అందించడానికి వస్తున్న టాస్క్ ఫోర్స్ టీం ను ఉద్దేశిస్తూ వారిని అభినందించారు.
నియోజకవర్గంలో తేదేపా కుటుంబ సభ్యులకు, మహిళలకు, యువతకు ఏ సమయంలోనైనా, ఎలాంటి ఇబ్బందులెదురైనా దాదాపు ఒకటిన్నర గంట సమయంలో మన టాస్క్ ఫోర్స్ టీం ఘటనా స్థలానికి చేరుకొని భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ బద్ధమైన ఐపిసి సెక్షన్ ప్రకారం తేదేపా కుటుంబం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధ పడటం గర్వంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, తేదేపా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, యువత మరియు నూతనంగా ఏర్పాటవుతున్న టాస్క్ఫోర్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa