ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసాంఘిక కార్యక్రమాలకు యువత స్వస్తి పలకాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 01:39 PM

డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు యువత సుస్తీ పలకాలని 11వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ గోతం. బాలకృష్ణ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో వార్డులో పర్యటిస్తూ , ఎన్టీఆర్ నగర్ మెయిన్ రోడ్డులో లైట్స్ సమస్య అని తెలుపగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్, మూడు జెండాల సెంటర్ పార్కు, రింగ్ రోడ్డు వాటర్ ట్యాంక్, గవర్నమెంట్ స్కూల్ మరియు రాయపుపాలెం ప్రాంతాల్లో పరిశీలించారు. ఎవరైనా రాత్రి సమయంలో ఆ ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేసినట్లు అయితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ సమయంలో అయినా సమస్య ఉన్నచో తనకు ఫోన్ చేసి తెలపాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa