ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం లో ఘోరం.. రహదారి రక్తదాహానికి బలైన మనుషులు, మూగ జీవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 07:37 PM

ప్రకాశం జిల్లాలో ఇవాళ రహదారి రక్తదాహానికి పలువురు బలయ్యారు. మోక్షగుండం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గిద్దలూరు నుంచి మిర్చి లోడుతో గుంటూరు వెళుతున్న డీసీఎంను ఓ మినీ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ ట్రాలీలో ఉన్న 6 ఆవులు కూడా మృత్యువాతపడ్డాయి. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద ఘటన స్థలిలో దృశ్యాలు బీభత్సంగా ఉన్నాయి. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ఇంజిన్ క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తులతో పాటు మూగ జీవాలు కూడా మరణించడం కలచివేసింది. కాగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa