ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక హిజాబ్ వివాదం మూడు రోజుల సెలవులు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 10:11 AM

బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ప్రజలంతా శాంతియుత వాతావరణానికి సహరించాలని సీఎం బొమ్మై విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల క్రితం  ఉడిపిలోని కళాశాలలో హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కారు సెలవుల నిర్ణయం తీసుకుంది. మరోవైపు హిజాబ్ వివాదంపై విచారణను కర్ణాటక హైకోర్టు రేపటికి వాయిదా వేసింది..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa