ప్రకాశం జిల్లాలో ఇటీవల ప్రజలు విద్యుత్ కోతలతో సతమతమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు మరింత ఎక్కువ ఇబ్బంది పడ్డారు. అసలే వేసవి కాలం సమీపిస్తుండడంతో విద్యుత్ కోతలు పెరిగితే ఇబ్బందులు పడతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గత కొద్ది రోజులుగా ముందస్తు సమాచారం ఏమి లేకుండా ప్రకాశం జిల్లా ప్రాంతం లోని మండలం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయి. సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే పైనుంచి పోయింది అంటూ చాలా తాపీగా సమాధానం ఇస్తున్నారు.
ప్రజలు ఎందుకు పోయిందని అడిగితే ఏమో తెలియదని కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అసలు కరెంటు ఎందుకు ఇలా పోతుందో సమాధానం చెప్పాలని నిలదీసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
ఉన్నత అధికారులు మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని, విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ గ్రిడ్ లు ఫెయిల్ కావడం వల్ల విద్యుత్ నిలిచిపోయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు.
మరోపక్క విద్యుత్ సంస్థలకు రాష్ట్రం బకాయిలు చెల్లించకపోవడంతో ఇందుకు కారణమని కరెంటు కోతలు కూడా పెరిగిపోవడానికి కారణం ఇదేనని మీడియాలో కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ప్రభుత్వ వ్యతిరేకులు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు ప్రజల దృష్టికి రాకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించి విద్యుత్ కోతలు లేకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో సంబంధిత అధికారులు విద్యుత్ కోతలు లేకుండా చూస్తారో లేదా విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులు పాలయ్యాలా చేస్తారో వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa