ట్రెండింగ్
Epaper    English    தமிழ்

60 మంది మత్స్యకారుల అపహరణ

international |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 02:53 PM

అరేబియా సముద్ర తీరంలో.. పాకిస్థాన్ ఆగడాలు మితిమీరుతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్థాన్ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే  మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్థాన్ తీర ప్రాంత రక్షకదళం అపహరించినట్లు.... తెలుస్తోంది. ఓఖా, పోరుబందర్ లకు చెందిన  మత్స్యకారులను... పాకిస్థాన్ బందీలుగా  ఉంచుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మెరైన్ సెక్యూరిటీ  ఆగడాలతో.... మత్స్యకారులు భయాందోళనలకు లోనవుతున్నారు. భారత ప్రాదేశిక జలాల్లోనే . చేపల వేటకు వెళ్తున్నప్పటికీ పాకిస్థాన్ అక్రమంగా అపహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa