ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యాపారి మంగళవారం ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు భారీ నష్టం వచ్చిందని పేర్కొంటూ తన భార్యతో కలిసి విషం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఆ వీడియో సంచలనంగా మారింది. గురువారం ఓటింగ్ జరిగే పట్టణాలలో ఒకటైన బాగ్పత్కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కానీ అతని భార్య మరణించిందని పోలీసులు పేర్కొన్నారు.
ఇక బాధిత వ్యాపారి ఫేస్బుక్ లైవ్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు అప్పులు తీర్చుకునే సామర్ధ్యం ఉందని తెలిపాడు. తాను దేశ వ్యతిరేకిని కాదనీ, తనకు దేశంపై విశ్వాసం ఉందని పేర్కొన్నాడు. ప్రధాని మోదీకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, ఆయన చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషులు కాదని అన్నాడు. విధానాలను మార్చుకోవాలని సూచించాడు. జీఎస్టీ తన వ్యాపారాన్ని దెబ్బతీసిందని వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫేస్బుక్లో లైవ్లో వీక్షిస్తున్న వారు పోలీసులకు ఫోన్ చేయగా, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. 38 ఏళ్ల పూనమ్ తోమర్ ఆసుపత్రిలో మరణించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. యుపి అంతటా చిన్న వ్యాపారులలో ఈ రకమైన బాధలను చూస్తున్నామని అన్నారు. నోట్ల రద్దు, జిఎస్టి, లాక్డౌన్ చాలా బాధించాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa