ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి యాజమానులు కూడా ఉంటారా

national |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 05:59 PM

ఎంత పనిచేసినా చేసిన పనికి యాజమాన్యం నుంచి గుర్తింపు లభించని పరిస్థితి నేడు. కానీ అందుకు భిన్నంగా తన కింది సిబ్బంది చేసే పనిని గుర్తించడమే కాదు దానికి ప్రశంసగా బహుమతి అందిస్తే ఇంతకంటే ప్రశంసించదగ్గ విషయముంటుందా...? కేరళలో ఒక ఉద్యోగికి తన జీవితంలో అత్యంత అమూల్యమైన కానుక అందింది. అదేమిటంటే తాను పనిచేసే కంపెనీ బాస్ నుంచి మెర్సిడెస్ బెంజ్ కారు గిఫ్ట్‌గా వచ్చింది. కేరళకు చెందిన ఏకే షాజి అనే వ్యాపారవేత్త మైజీ పేరుతో డిజిటల్ రిటైల్ స్టోర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే తన సంస్థలో పనిచేసే చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సీఆర్ అనీష్‌కు ఏకే షాజీ మెర్సిడెస్ బెంజ్‌ను గిఫ్ట్‌గా అందించారు. గత 22 సంవత్సరాలుగా ఏకధాటిగా తన సంస్థలో పనిచేసిన విశ్వసనీయతకు గుర్తింపుగా ఏకే షాజి మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ క్లాస్ 220డీ కారును ఉద్యోగికి అందించారు. ‘‘డియర్ అనీ.. గత 22 ఏళ్లుగా.. మీరు నాకు స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉన్నారు. మీరు మీ క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వ్యాపారవేత్త రాసుకొచ్చారు. అలాగే ఉద్యోగికి, తన కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చిన బ్లాక్ లగ్జరీ ఎస్‌యూవీ ఫోటోను ఈ వ్యాపారవేత్త షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘మేము పార్టనర్లం. కేవలం తను ఉద్యోగి మాత్రమే కాదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా గర్వకారణమైన క్షణం. గత 22 ఏళ్లుగా అనీ నాతోనే ఉన్నారు. ఈ ఏడాది నాతో పాటు ఉన్న పార్టనర్లకు మరిన్ని కార్లు వస్తాయని ఆశిస్తున్నాను’’ అంటూ షాజి చెప్పారు. మైజీ ఎంప్లాయీస్, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో అనీష్‌కు షాజి ఈ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మైజీ ఏర్పాటు చేయడాని కంటే ముందు నుంచే అనీష్, షాజితో కలిసి పనిచేస్తున్నారు. కంపెనీ మార్కెటింగ్, మెయింటనెన్స్, డెవలప్‌మెంట్ యూనిట్లలో అనీష్ పనిచేశారు. ఈయన ఉత్తర కేరళలో కోజికోడ్ జిల్లాకు చెందిన వారు. రెండేళ్ల క్రితం కూడా షాజి ఆరుగురు ఉద్యోగులకు కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇదిలావుంటే గుజరాత్‌లోని వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా కూడా తన ఉద్యోగులకు విలాసవంతమైన బహుమతుల్ని అందించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో దివాళి సందర్భంగా తన ఉద్యోగులకు 600 కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. వీటిలో మూడు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్‌యూవీ కార్లు కూడా ఉన్నాయి. వీటి వాల్యు రూ.3 కోట్లు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa