ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటి ఘటన మరవకముందే...ఉన్నావ్ లో మరో దారుణం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 01:38 AM

నాటి ఘటన మరవకముందే ఉన్నావ్ లో మరో దారుణం చోటుచేసుకొంది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో 22 ఏళ్ల దళిత యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గొంతు నులిమి, మెడలు విరిచేసి దారుణంగా చంపేశారు. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి.. నిన్న ఉన్నావ్ లో శవమై కనిపించింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన యూపీ మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు చెందిన ఆశ్రమంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దుండగులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టంలో ఈ విస్తుపోయే నిజాలు తెలిశాయి. మెడలు విరిచేయడంతో పాటు తలమీద రెండు గాయాలున్నట్టు తేలింది. ఇదిలావుంటే డిసెంబర్ 8న తమ బిడ్డ కనిపించకుండా పోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించలేదని చనిపోయిన యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరితోనో పారిపోయింది.. వస్తుందిలే అంటూ గేలి చేశారని అన్నారు. ఎస్పీని కూడా కలవనివ్వలేదన్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ శశి శేఖర్ సింగ్ చెప్పారు. కేసుకు సంబంధించి మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్ ను విచారిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa