చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోంది. మొత్తం 117 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా.. 1304 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అయితే వీరిలో 25శాతం మంది నేర చరితులే కావడం గమనార్హం. 57 నియోజకవర్గాల్లో అయితే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది నేర అభియోగాలున్న వ్యక్తులే పోటీలో ఉన్నారు. ఇక మొత్తం అభ్యర్థులో 521 మంది కోటీశ్వరులున్నారు. ఈ మేరకు అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది.. మొత్తం 1304 మంది అభ్యర్థుల్లో 1276 మంది ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఈ నివేదిక రూపొందించింది. మిగతా 28 అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో వివరాలు పూర్తిగా లేకపోవడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్ తెలిపింది. పంజాబ్ ఎన్నికల్లో జాతీయ పార్టీల నుంచి 228 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 256 మంది పోటీ చేస్తున్నారు. 447 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. మిగతా వారు గుర్తింపు లేని పార్టీల నుంచి పోటీ చేస్తున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. .
315 మందిపై క్రిమినల్ కేసులు.
్మొత్తం 1304 మంది అభ్యర్థుల్లో 1276 మంది ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఈ నివేదిక రూపొందించింది. మిగతా 28 అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో వివరాలు పూర్తిగా లేకపోవడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్ తెలిపింది. పంజాబ్ ఎన్నికల్లో జాతీయ పార్టీల నుంచి 228 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 256 మంది పోటీ చేస్తున్నారు. 447 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. మిగతా వారు గుర్తింపు లేని పార్టీల నుంచి పోటీ చేస్తున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. . . గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కోటీశ్వరుల జాబితా పెరిగింది. 2017 ఎన్నికల్లో 428 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాగా.. తాజా ఎన్నికల్లో ఈ సంఖ్య 512కు పెరిగింది. మొత్తం పోటీ చేస్తున్న వారిలో 41శాతం మంది సంపన్నులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలో 107 మంది కోటీశ్వరులు ఉండగా.. శిరోమణి అకాలీదళ్ పార్టీలో 89 మంది, ఆమ్ ఆద్మీ పార్టీలో 81, భాజపాలో 60 మంది అభ్యర్థులు తమ ఆస్తులు రూ.కోటి పైనే ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తోన్న కుల్వంత్ సింగ్ రూ.238 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ బాదల్ రూ.202 కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ కుమార్ రూ.155 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. పంజాబ్లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలను ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa