ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయలలిత మరణంపై వివరాలు సేకరిస్తున్న కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2017, 02:56 PM

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై రాష్ట్ర సర్కార్ న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. జయలలిత చివరి రోజుల్లో జరిగిన పరిణామాలపై తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు…రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో ఈ అంశానికి సంబంధించి చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవలే తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాస్‌ అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సైతం జయ మిస్టరీ డైత్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం న్యాయ విచారణ కోసం కమిటీని నియమించింది. తాజాగా కేంద్రం సైతం రంగంలోకి దిగటంతో జయ మరణంపై నెలకొన్న అనుమానాలు త్వరలోనే తీరిపోతాయని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa