ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 11:42 AM

స్థానికమండల కేంద్రంలోని ధర్మవరం ప్రధాన రహదారి యందు ఎస్. ఐ. లింగన్న ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.


ఈ సందర్భంగా ఆయన వాహనదారులు తో మాట్లాడుతూ ఎవరు కరోనా నిబంధనలు ఉల్లంఘించ రాదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, వాహనదారులు తప్పక ట్రాఫిక్ నియమా నిబంధనలు పాటించాలని అన్నారు.


ట్రాఫిక్ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆటో వారు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదు అన్నారు.


ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ తో , పాటు మాస్క్ ధరించాలని , వాహనదారులు మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపినట్లు మాకు సమాచారం అందితే వారి పై కఠిన మైన చర్యలు తీసుకుంటామని అన్నారు.


ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలి అని ఆయన వాహనదారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa