ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ రైళ్లలో ఫుడ్ సర్వీస్...గ్రీన్ సిగ్నల్ ఐఆర్ సీటీసీ

national |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 12:42 PM

కోవిడ్ కారణంగా మనం రవాణాలో ఎన్నో సదుపాయాలను కోల్పోయాం. తాజాగా ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా శుభవార్త అందించింది. వచ్చే వారం నుంచి అన్ని ట్రైన్స్‌లోనూ వండిన ఆహరాన్ని అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి ఈ మీల్స్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఈ సర్వీసులను గత ఏడాది నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి నాటికి కుక్‌డ్ ఫుడ్ సర్వీసులను దాదాపు 80 శాతం ట్రైన్స్‌లో అందుబాటులో ఉంచారు. రెడీ టు ఈట్ మీల్స్‌ను కూడా డిమాండ్ ప్రాతిపదికన ప్రయాణికులకు అందిస్తామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. కోవిడ్ 19 కారణంగా 2020 మార్చి 22 నుంచి ఇకేటరింగ్ సర్వీసులను నిపులుదల చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఐఆర్‌సీటీసీ రెడీ టు ఈట్ మీల్ సర్వీసు‌లను ప్రారంభించింది. ఇదిలావుంటే ఐఆర్‌సీటీసీ ఇకేటరింగ్ సర్వీసులను 2014లోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీసుల్లో భాగంగా ప్రయాణికులు వారికి నచ్చిన ఫుడ్‌ను నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ట్రైన్‌లో ప్రయాణీకుల సీటు వద్దనే ఈ ఫుడ్ ఆర్డర్ వచ్చి చేరుతుంది. కోవిడ్ 19కు ముందు ఐఆర్‌సీటీసీకి రోజుకు 20 వేల ఇకేటరింగ్ ఆర్డర్లు వచ్చేవి. అంటే ప్రయాణికులు ఏ స్థాయిలో ఈ సర్వీసులను ఉపయోగించుకునే వారో అర్థం చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫుడ్ ఎలా ఆర్డర్ ఇవ్వాలో ఒకసారి తెలుసుకుందాం. తొలిగా ఐఆర్‌సీటీసీ ఇకేటరింగ్ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. https://www.ecatering.irctc.co.in/ ద్వారా మీరు నేరుగా ఇకేటరింగ్ సర్వీసులు పేజ్‌లో వెళ్లొచ్చు. తర్వాత మీ పది నెంబర్ల పీఎన్ఆర్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్‌మిట్ చేయాలి. అటుపైన మీకు అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఔట్‌లెట్స్, కఫేల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన ఫుడ్‌ను నచ్చిన ఔట్‌లెట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇవ్వాలి. పేమెంట్ చేయాలి. మీరు ఆన్‌లైన్‌లోనే డబ్బులు కట్టొచ్చు. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆర్డర్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే.. మీ ఫుడ్ మీ సీటు దగ్గరికే వస్తుంది. మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇది చాలా మంది సర్వీస్ అని చెప్పుకోవచ్చు. ప్రయాణికులు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ట్రైన్‌లో తినొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa