ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాగా నట్టించారు..ఆయనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందే: కె.అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 12:45 AM

ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి సీఎం జగన్ నటించారని.. ఆయనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ టీడీపీ నేత కె.అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. జగన్ కేవలం తన కేసుల మాఫీ కోమమే ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను అమ్మేశారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. విభజన సమస్యల పరిష్కారానికి నియమించి ఉప కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి మళ్లీ తొలగించడం వైఎస్సార్‌సీపీ చేతకానిని తనానికి నిదర్శనమంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత వైఎస్సార్‌సీపీ ఎంపీలకు గానీ.. జగన్‌కు గానీ లేదని.. వెంటనే రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా ప్రత్యేక హోదా అంశం వినిపించకుండా నిషేధించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ నెల 17న విభజన సమస్యలపై సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందించింది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ వర్చువల్‌గా నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa