ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో పెరిగిన ఓటర్ల సంఖ్య.. పురుషులే అధికం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 08:45 AM

కేంద్ర ఎన్నికల సంఘం 2022 ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దేశంలో ఓటర్ల సంఖ్య 95,24,81,459 కి చేరింది. 2020 జాబితాతో పోలిస్తే తాజాగా ఓటర్ల సంఖ్య 3,26,96,445 మేర పెరిగింది. ఓటర్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య 6.79 % అధికంగా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి యూపీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. సిక్కింలో అతి తక్కువగా ఉన్నారు.


దేశంలో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అవి పుదుచ్చేరి, కేరళ, మణిపుర్‌, మిజోరం, గోవా, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌. మిగిలిన అన్ని రాష్ట్రాలు, యూటీల్లోనూ పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా ప్రవాస ఓటర్ల సంఖ్య 1,22,200 గా ఉంది. సర్వీసు ఓటర్లు 19,12,708 మంది ఉన్నారు.


తాజాగా ఎన్నికలు జరుగుతున్న యూపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,05,83,879కి చేరింది. సిక్కింలో 4,46,262 మంది ఓటర్లున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఓటర్ల సంఖ్య 56,269 మాత్రమే.


ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య యూపీ, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఏపీలో అధికంగా ఉంది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా కేరళలో (92,486) ఉన్నారు. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(7,065), ఏపీ(7,033)లు ఉన్నా యి. అత్యధిక సర్వీసు ఓటర్లున్న రాష్ట్రాల్లో యూపీ(2,98,746) తొలిస్థానాన్ని ఆక్రమించింది.


మొత్తం ఓటర్లు : 95,24,81,459


పురుషులు: 49,18,60,931


మహిళలు: 46,05,74,630


ట్రాన్స్ జెండర్లు: 45,898


ఆంధ్రప్రదేశ్ ఓటర్లు: 4,07,36,279


తెలంగాణ: 3,03,71,555






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa