ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలమంచిని కోర్టుకు హాజరైన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు

Andhra Pradesh Telugu |   | Published : Fri, Oct 06, 2017, 01:20 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ఉదయం ఎలమంచిలి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పాయకరావుపేట ఉప ఎన్నిక జరుగగా, ఆ సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు అయ్యన్నపాత్రుడిపై కేసు దాఖలైంది. కోర్టు విచారణకు ఆయన సక్రమంగా హాజరు కాకపోవడంతో ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన ఆయన, న్యాయమూర్తి ఎదుట హాజరై, తనపై ఉన్న ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసు ఇదని ఆరోపించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa