ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2017, 01:21 PM

భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 వి5 హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం ఉదయం చైనా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. మిలటరీ రవాణాకు ఉపయోగించే ఈ హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణించారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇది కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.


నాలుగేళ్ల క్రితం కూడా ఎంఐ-17 వి5 హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరఖండ్ వరద బాధితులను రక్షించేందుకు వినియోగించిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను జూలైలో రష్యా మనకు అందించిందని పీటీఐ తెలిపింది. కజన్ హెలికాప్టర్ ప్లాంట్‌లో తయారు చేసిన 151 యూనిట్ల ఎంఐ-17 వి5 హెలికాప్టర్లను రోస్‌టెక్ స్టేట్ కార్పొరేషన్ మనకు అందించడానికి గతంలో ఒప్పందం కుదుర్చుకుంది.సైన్యానికి సరకుల రవాణా కోసం ఉపయోగించేలా ఈ హెలికాప్టర్‌కు రూపకల్పన చేశారు. సైన్యం రవాణా కోసం వినియోగిస్తున్న అత్యాధునిక హెలికాప్టర్‌గా ఎంఐ-17 వి5ను పరిగణిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa