సదావర్తి భూముల వ్యవహారంలో తమిళనాడు సర్కారు కూడా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వేలం జరిగిన భూములు తమ పరిధిలోనే ఉన్నాయని, ఆ కారణంతో తమను కూడా ఈ విచారణలో ఇంప్లీడ్ చేసుకోవాలని తమిళనాడు సర్కారు కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేసింది. ఈ రోజు దానిపై విచారించిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఏపీ, తమిళనాడుల్లో భూ యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని ఆదేశిస్తూ ఈ కేసును ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa