ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై 500ల టన్నుల ఐఎస్ఎస్ కూలొచ్చు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 11:46 AM

అమెరికా తమపై ప్రకటించిన ఆర్థిక ఆంక్షలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రష్యా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఎస్ఎస్ నియంత్రణ కోల్పోయి, కూలిపోతే మిమ్మల్సి ఎవరు కాపాడతారని అమెరికా, యూరప్ దేశాలను ఉద్దేశించి అన్నారు. రష్యా భూభాగంలో ఐఎస్ఎస్ పడే అవకాశం లేదన్నారు. 500 టన్నుల నిర్మాణాన్ని తాము కూల్చేస్తే అది భారత్, చైనా, అమెరికా, యూరప్ దేశాలపైనే పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాలన్నింటికీ అమెరికా సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు.


ప్రస్తుతం, ISSలో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు మరియు ఒక జర్మన్ వ్యోమగామి మైక్రోగ్రావిటీలో పక్కపక్కనే పనిచేస్తున్నారు. మరోవైపు రష్యాపై విధించిన కొత్త ఆంక్షలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. రష్యాతో సంబంధాలకు దీని వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సురక్షిత ఆపరేషన్ల కోసం రష్యాతో పాటు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి నాసా పని చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa