ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌లో భారతీయులకు కీలక సూచన

national |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 11:50 AM

ఉక్రెయిన్‌లో సరిహద్దులకు వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం సూచించింది. తాజాగా శనివారం భారత విదేశాంగ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. యుద్ధ భూమిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న భారతీయులను త్వరితగతిన తరలించే చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా దేశాల మీదుగా స్వదేశానికి తరలిస్తుండడంతో భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో భీతావహ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ప్రకటన విడుదలైంది. అయితే పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలకు రావాలని విదేశాంగ శాఖ సూచించింది. ఆ ప్రాంతంలోని ప్రధాన నగరాలలో భారత ఎంబసీ క్యాంపులను ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత త్వరగా భారతీయులందరినీ స్వదేశానికి తరలించేందుకు రొమేనియాలోని భారత ఎంబసీ కృషి చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa