ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకర్లు రుణాల మంజూరును వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:59 AM

వివిధ ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు, పంపిణీని బ్యాంకర్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని డిపిఆర్సి భవనంలో జిల్లా సంప్రదింపుల కమిటీ , జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను చేరుకోవడం లేదని, రుణాల మంజూరులో వెంటనే పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్, స్టాండప్ ఇండియా, ముద్ర రుణాలు,   చేనేత కార్మికులకు వీవర్స్ కు రుణాలు అందించడంలో మరింత పురోగతి చూపించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిధిలో రైతులకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాల పంపిణీ చేపట్టాలన్నారు. ముద్రా రుణాలకు సంబంధించి 50 వేల రూపాయల లోపు అందించే శిశు రుణాలు, 50 వేల నుంచి 5 లక్షల రూపాయలు లోపు అందించే కిషోర్ రుణాలు మాత్రమే ఎక్కువగా అందిస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని, బ్యాంకులకు దరఖాస్తులను అందిస్తున్నా లక్ష్యాలను చేరుకోవడం లేదని, అలా కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య అందించే తరుణ్ రుణాలను ఎక్కువగా ఇచ్చేలా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు.


జగనన్న తోడు పథకానికి సంబంధించి ప్రారంభం తేదీ దగ్గర పడుతోందని, వెంటనే శుక్రవారంలోపు అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు చేపట్టి, రుణాల పంపిణీని ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏపీ టిడ్కో కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అర్హులైన వారికి రుణాల  మంజూరును చేపట్టాలని, డిసెంబర్ నాటికి టిడ్కో ఇల్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని, అందుకు తగిన విధంగా ఆయా బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa