ఒక్క ఛాన్స్ లో బిట్ కాయిన్ అతన్ని ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా నిలిచేలా చేసింది. ఇందుకు అతడు చేసిందేమిటో తెలుసా...? ఇల్లు అమ్మేసీ భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీని దాటిపోయాడు. ఒకాయన తన ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బులను బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశాడు. అంతే ఆయన సుడి తిరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. ఇంతకి ఆయన ఎవరూ? ఆయన పేరు ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. ఆయన పేరు చాంగ్పెంగ్ జావో. ఈయన ఆరంభంలో ఖర్చుల కోసం పిజ్జా హోటల్లో కూడా పని చేశాడు. కుటుంబ పోషణ కోసం పలు రకాల జాబ్స్ చేశాడు. అలాంటిది ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగారంటే నమ్మశక్యం కావడం లేదా? అయినా ఇది నిజం. జావో ఇప్పుడు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ వంటి వారి సరసన చేరాడు. ఇంతకి ఈయన ఏం చేస్తాడో తెలుసుకోవాలని ఉందా? ఈయన బినాన్స్ క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడు. జావో సంపద విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం చూస్తే.. చాంగ్పెంగ్ జావో ప్రపంచ సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైమన బినాన్స్ వ్యవస్థాపకుడు ఈయన. జావో నికర సంపద విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ.7.2 లక్షల కోట్ల పైమాటే. దీంతో ఈయన ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (107 బిలియన్ డాలర్లు - 10వ స్థానం), రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ (93 బిలియన్ డాలర్లు - 12వ స్థానం) మధ్య జావో చోటు సంపాదించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంటే ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ వంటి వారి సరసన జావో చేరడానికి క్రిప్టో కరెన్సీల జోరు బాగా దోహదపడిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్ కూడా జావోనే. అయితే క్రిప్టో కరెన్సీల్లో ఎవరు ధనవంతులు అవుతారో.. మరెవరు బికారులు అవుతారో చెప్పడం చాలా కష్టం. చాలా మంది బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa